Bandi Sanjay: కరీంనగర్ ఎంపీగా గెలిచిన తర్వాత..ఏ సాధించానో ఈ యాత్రలో చెబుతా

-

Bandi Sanjay: కరీంనగర్ ఎంపీగా గెలిచిన తర్వాత..ఏ సాధించానో ఈ యాత్రలో చెబుతానంటూ బండి సంజయ్ పేర్కొన్నారు. ప్రజాహిత యాత్ర కు బయలుదేరారు బండి సంజయ్. కరీంనగర్ మహాశక్తి ఆలయంలో పూజలు అనంతరం ఇంటి వద్ద తల్లి ఆశీర్వాదం తీసుకున్న సంజయ్…కొండగట్టు అంజన్నకు పూజలు చేసి మెడిపల్లి నుంచి ప్రజాహిత యాత్ర ప్రారంభించనున్నారు.

Bandi Sanjay about his yatra

కరీంనగర్ ఎంపీగా గెలిచిన తర్వాత ప్రజలకు ఏం చేసానో వివరించేందుకే ఈ యాత్ర చేస్తున్నట్లు ఈ సందర్భంగా వెల్లడించారు బండి సంజయ్‌. తాను ఏం చేయలేదని అంటున్న వాళ్లకు సమాధానం చెప్పేందుకే యాత్ర అని..గ్రామాలకు కేంద్రం ఇచ్చిన నిధులే తప్ప బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది సున్నా అంటూ విరుచుకుపడ్డారు. ఏకగ్రీవ సర్పంచ్ లకు ప్రోత్సాహకాలు ఇవ్వలేదని…సర్పంచ్ లు రోడ్డున పడేసిన ఘనత బీఆర్ఎస్ ది అన్నారు. ఈ యాత్ర ద్వారా తాము చేసింది.. చేయబోయేది ప్రజలకు వివరిస్తానన్నారు బండి సంజయ్.

Read more RELATED
Recommended to you

Latest news