బండి సంజయ్ కూడా కేసీఆర్ ప్రభుత్వ లబ్ధిదారుడే – మంత్రి ప్రశాంత్ రెడ్డి

-

నిజమాబాద్: లక్కోరా లోని వేల్పుర్ మండలంలో బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బండి సంజయ్ కూడా కేసిఆర్ ప్రభుత్వ లబ్దిదారుడేనని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో లేని బండి సంజయ్ దశాబ్ది ఉత్సవాలను కేసిఆర్ కుటుంబ ఉత్సవాలు అనడం ఆయన అవివేకం అన్నారు.

పసుపు బోర్డు పేరుతో రైతులను నిండా ముంచిన బీజేపీని నమ్మే ప్రసక్తే లేదన్నారు ప్రశాంత్ రెడ్డి. అభివృద్ధి చేయని బీజేపీకి ఓట్లు అడిగే హక్కు లేనే లేదన్నారు. తెలంగాణ లో ఓట్లు అడిగే హక్కు బి.ఆర్.ఎస్. కు మాత్రమే ఉందన్నారు. తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్ గా ఉందన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version