కాంగ్రెస్ ఉగ్రవాద పార్టీ – బండి సంజయ్‌ సంచలనం !

-

 

కాంగ్రెస్ ఉగ్రవాద పార్టీ అంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. సికింద్రాబాద్ లో ధ్వంసమైన ముత్యాలమ్మ ఆలయాన్ని సందర్శించిన బండి సంజయ్…అనంతరం మాట్లాడారు. హిందూ దేవాలయాలపై దాడులు చేసే వాళ్లను… పిచ్చోళ్లని పోలీసులు ముద్రవేస్తారా? అని ప్రశ్నించారు. ఇతర మతాల ఆలయాలను ఆ పిచ్చోళ్లు ఎందుకు దాడి చేయడం లేదు? అని నిలదీశారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌.

పోలీస్ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పోతోందని తెలిపారు. ఆలయాలపై దాడులు జరుగుతుంటే కాంగ్రెస్ నేతలు ఎందుకు స్పందించడం లేదు? అని నిలదీశారు మేం స్పందిస్తే… బీజేపీని ఉగ్రవాదుల పార్టీగా ముద్ర వేస్తారా? అంటూ ఆగ్రహించారు. ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తున్న ఎంఐఎంతో అంటకాగుతున్న కాంగ్రెస్ ఉగ్రవాద పార్టీ… తక్షణమే దుండుగులపై కఠినాతికఠినంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ విషయంలో ఎటువైపు ఉంటారో కాంగ్రెస్ తేల్చుకోవాలన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌.

Read more RELATED
Recommended to you

Latest news