ఎంపీ ఎన్నికల్లో ఓడిపోతే.. రాజకీయ సన్యాసం తీసుకుంటా -బండి సంజయ్‌

-

BREAKING: ఎంపీ ఎన్నికల్లో ఓడిపోతే.. రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్‌ చేశారు ఎంపీ బండి సంజయ్‌. బండి సంజయ్ మీద కాంగ్రెస్ పార్టీ నాయకులు రాళ్ళ దాడి చేశారు. హుస్నాబాద్ రాములపల్లి గ్రామంలో ఎంపీ బండి సంజయ్ ప్రజాహిత యాత్రపై రాళ్లతో దాడి చేశాయి కాంగ్రెస్ శ్రేణులు. పొన్నం ప్రభాకర్‌ పై బండి సంజయ్‌ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బండి సంజయ్ మీద కాంగ్రెస్ పార్టీ నాయకులు రాళ్ళ దాడి చేశారు.

bandi sanjay vs ponnam

అయితే…పొన్నం అనుచరులు చేసిన దాడిపై బండి సంజయ్‌ స్పందించారు. ఈ ఎన్నికల్లో ఓడిపోతే నేను రాజకీయ సన్యాసం చేస్తాను… కాంగ్రెస్ ఓడితే పొన్నం రాజీనామా చేస్తారా? అంటూ సవాల్‌ విసిరారు. పొన్నం అహంకార వ్యాఖ్యలు మానుకోవాలని ఫైర్‌ అయ్యారు బండి సంజయ్‌. ఇక అటు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మంత్రి పొన్నం ప్రభాకర్ పై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కరీంనగర్లోని తెలంగాణ చౌక్ లో బండి సంజయ్ దిష్టిబొమ్మ దగ్ధం చేసేందుకు ప్రయత్నించారు కాంగ్రెస్ కార్యకర్తలు.

Read more RELATED
Recommended to you

Latest news