అప్పటిదాకా బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా బండి సంజయ్

-

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ పదవి చేపట్టి  వచ్చే నెల 11వ తేదీకి మూడేళ్లు పూర్తి కానుంది. ఈ క్రమంలో ఆ పార్టీ  రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్​ చుగ్​ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ సంస్థాగత ఎన్నికలు జరిగే వరకు బండి సంజయ్ అధ్యక్షుడిగా కొనసాగుతారని స్పష్టం చేశారు.

పార్టీ సంస్థాగత ఎన్నికలు 2024లో జరుగుతాయని తరుణ్ చుగ్ తెలిపారు. అంత వరకు అధ్యక్షుడిగా బండి సంజయ్​ను కొనసాగించాలని జాతీయ నాయకత్వం భావిస్తున్నట్లు స్పష్టం చేశారు. అధికారిక ప్రకటన మార్చి మొదటి వారంలో వెల్లడించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా అధికారం చేపట్టిన బండి సంజయ్ ​కుమార్ మొదటి నుంచి​ ఆపార్టీ బలోపేతానికి తన వంతు ఎంతో కృషి చేస్తున్నారు. ముఖ్యంగా మహాసంగ్రామ పాదయాత్ర చేస్తూ ప్రజల సమస్యలను గుర్తించారు. ఎక్కడిక్కడ భారీ బహిరంగ సభలు నిర్వహిస్తూ కేసీఆర్​ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకొని తీవ్ర విమర్శలు చేసేవారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి బండి చేస్తున్న కృషిని పీఎం మోదీ కూడా పలుమార్లు ప్రశంసించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version