కాంగ్రెస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పార్టిలో చేరానా అంటే నా దగ్గర సమాధానం లేదని పేర్కొన్నారు. నేను ఏ పార్టీలో ఉన్నానో ప్రజలకు తెలుసు అన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతిచ్చా.. అవే కావడం లేదని పేర్కొన్నారు.

ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా గద్వాలలో అభివృద్ధి పనులు జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. భవిష్యత్తులో భగవంతుని ఆదేశానుసారం ముందుకెళ్తా… ప్రభుత్వం వచ్చి రెండేళ్లయినా గద్వాలలో ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయని తెలిపారు. ఇరిగేషన్ ప్రాజెక్టులు, మెడికల్ కాలేజీపై ఎన్నోసార్లు విజ్ఞప్తి చేశానని… ఇప్పుడైనా సీఎం రేవంత్ పట్టించుకుంటారని ఆశిస్తున్నా అని చెప్పారు కాంగ్రెస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి.