జూరాల ప్రాజెక్టు 9వ నంబర్ గేట్ రోప్ తెగిపోవడం కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. జూరాల ప్రాజెక్టులోని 9వ నంబర్ గేట్ రోప్ తెగిపోవడం కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఒక్క ఇటుక పేర్చడం కూడా చేతకాని ముఖ్యమంత్రికి కనీసం ఉన్న ప్రాజెక్టు నిర్వహణ కూడా రాకపోవడం వల్లే ఇవాళ జూరాల ప్రాజెక్టు డేంజర్లో పడింది… ప్రతి ఏటా వరద వస్తుందని తెలిసినా స్పిల్వే వద్ద మెయింటెనెన్స్ పనులు చేయించడంలో రేవంత్ సర్కార్ నిర్లిప్తత స్పష్టంగా కనిపిస్తోందని ఫైర్ అయ్యారు.
జూరాలకు క్రమంగా వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి, మంత్రులు ఇప్పటికైనా మొద్దునిద్ర వీడాలి… ఇప్పటికే ఈ ప్రభుత్వ అసమర్థత వల్ల ఎస్ఎల్బీసీ టన్నెల్ కుప్పకూలి ఎనిమిది మంది నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయని మండిపడ్డారు. పెద్దవాగుకు గండిపడి 16 గ్రామాలు ముంపునకు గురయ్యాయి… వట్టెం పంప్ హౌజ్ మునిగిపోయింది. సుంకిశాల రిటేనింగ్ వాల్ కుప్పకూలి వందల కోట్ల నష్టం వాటిల్లిందని తెలిపారు. ఇప్పుడు జూరాల 9వ నంబర్ గేట్ రోప్ తెగిపోవడంతోపాటు ఇతర గేట్ల రోప్లు బలహీనంగా ఉండటం ప్రాజెక్టును ప్రమాదంలోకి నెట్టిందని చెప్పారు.ప్రభుత్వం వెంటనే దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు, ఎగువ నుంచి పెరుగుతున్న ఇన్ఫ్లోను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ పకడ్బందీగా వ్యవహరించాలని వెల్లడించారు.
జూరాల ప్రాజెక్టులోని 9వ నంబర్ గేట్ రోప్ తెగిపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం
కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో జూరాల ప్రాజెక్టు ప్రమాదంలో పడింది
ఒక్క ఇటుక పేర్చడం కూడా చేతకాని ముఖ్యమంత్రికి కనీసం ఉన్న ప్రాజెక్టు నిర్వహణ కూడా రాకపోవడం సిగ్గుచేటు
ప్రతి… pic.twitter.com/tiBX4nHRMm
— Telugu Scribe (@TeluguScribe) June 26, 2025