విజయవాడకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క..!

-

తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ రోజు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ తో కలిసి ఖమ్మం జిల్లాలో వరద ముంపు ప్రాంతాలను పరిశీలించనున్నారు. ఐత్తే ఇందుకోసం హెలికాప్టర్లో విజయవాడకు వెళ్లనున్నారు. లాఫా విజయవాడలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ చౌహాన్తో భేటీ అవుతారు. ఆ తర్వాత ఇద్దరు హెలికాప్టర్లో మధిర నియోజకవర్గం కట్టలేరు ప్రాజెక్టు పరిధిలో ముంపునకు గురైన ఎర్రుపాలెం మండలం మీనవోలు, ఖమ్మం పట్టణంలో మున్నేరు ఉప్పొంగడంతో ముంపునకు గురైన ప్రకాష్ నగర్ ప్రాంతాలను ఏరియల్ సర్వే ద్వారా పరిశీలిస్తారు.

అనంతరం సూర్యాపేట జిల్లా మోతే మండలం సింగరేణి పల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన హెలి ప్యాడ్ వద్దకు చేరుకుంటారు. అక్కడి నుండి ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం జూజులురావుపేట్ గ్రామానికి రోడ్డు మార్గం ద్వారా చేరుకొని నీట మునిగిన పంట పొలాలను, వర్షం నేపథ్యంలో దెబ్బతిన్న ఎన్ఎస్పి కెనాల్ ను పరిశీలిస్తారు. అనంతరం పాలేరు ట్యాంక్ బండ్ వద్దకు చేరుకొని ఖమ్మం జిల్లా అధికారులు ఏర్పాటు చేసిన ఫోటో ఎక్సిబిషన్ ను తిలకిస్తారు. అక్కడే వరద ముంపుతో నష్టపోయిన రైతులతో కేంద్రమంత్రి నేరుగా మాట్లాడుతారు. ఆ తర్వాత హైదరాబాద్ కు వచ్చి కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్, సీఎం రేవంత్ రెడ్డితో కలిసి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారుల సమీక్ష సమావేశంలో పాల్గొంటారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version