బీఆర్ఎస్ పాలనలో ఎంపీకే రక్షణ లేకుంటే సామాన్యుల పరిస్థితి ఏంటి : భట్టి విక్రమార్క

-

దుబ్బాక ఎన్నికల ప్రచారంలో బీఆర్ ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను అని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. పార్లమెంటు సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి లాంటి వ్యక్తికి సరైన భద్రత ఇవ్వలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు అస్సలు ఉన్నాయా అని ఆయన ప్రశ్నించారు. బీఆర్ ఎస్ పాలనలో ఎంపీకే రక్షణ లేకుంటే సామాన్యుల పరిస్థితి ఏంటి అని అడిగారు. ఎంపీ ప్రభాకర్ రెడ్డి పై దాడి చేసిన నిందితుడిని పట్టుకున్న ప్రభుత్వం దాడి ఎందుకు చేశాడని విచారణ చేసి నిజ నిజాలను రాష్ట్ర ప్రజలకు తెలియజేయాల్సిన ప్రభుత్వం ఆ బాధ్యతను విస్మరించి దుష్ప్రచారం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను అంటూ బట్టి విక్రమార్క మండిపడ్డారు.

దర్యాప్తు సంస్థలు పోలీసులను మీ దగ్గర పెట్టుకుని దాడికి నిరసనగా బంద్ కాల్ ఇస్తామని ప్రకటన చేయడం విడ్డూరంగా ఉంది అని బట్టి విక్రమార్క అన్నారు. బంద్ కాల్ పిలుపు ఎవరిపైన ఇస్తున్నారు? బంద్ దేనికోసం? మీ పాలనపైన మీరే ఇచ్చుకుంటారా? బంద్ పేరుతో బాధ్యతల నుంచి తప్పుకుంటున్నారా అంటూ ఆయన విమర్శలు గుప్పించారు. దాడిపై సమగ్ర విచారణ చేసి నిజా నిజాలను బయట పెట్టండి అని బట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు దాడులను ప్రోత్సహించదు. అని సీఎల్పీ నేత బట్టి విక్రమార్క పేర్కొన్నారు. కాంగ్రెస్ అంటేనే అహింస పార్టీ. ఇటువంటి దాడులను కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖండిస్తుంది అని ఆయన తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news