కేటీఆర్ కు హైకోర్టులో బిగ్ రిలీఫ్

-

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు హైకోర్టు లో భారీ ఊరట లభించింది. సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో తనపై నమోదైన కేసు కొట్టివేయాలని కేటీఆర్ హైకోర్టులో క్వాష్ పిటిషన్  దాఖలు చేయగా.. కేసును క్వాష్ చేస్తూ నేడు ధర్మాసనం తీర్పునిచ్చింది. కాంట్రాక్టర్లు, బిల్డర్ల నుంచి రూ.2500 కోట్లు వసూలు చేసి సీఎం ఢిల్లీకి ముట్టజెప్పారని సీఎం రేవంత్ రెడ్డిని కించపరిచేలా మాట్లాడారని, సీఎం స్థాయి వ్యక్తి గౌరవానికి భంగం కలిగించేలా మాట్లాడినందుకు కేటీఆర్ పై చర్యలు తీసుకోవాలని సైఫాబాద్ పోలీస్ స్టేషన్ లో ఎంపీ అనిల్ ఫిర్యాదు చేశారు.

ఎలాంటి ఆధారాలు లేకుండా తనపై కేసు నమోదు చేశారని, తాను రేవంత్ రెడ్డిని అవమానించేలా
మాట్లాడలేదని, తనపై నమోదైన తప్పుడు కేసును కొట్టివేయాలని కేటీఆర్ హైకోర్టులో క్వాష్ పిటిషన్
వేశారు. ఇరువైపులా వాదనలు విన్న కోర్ట్.. కేటీఆర్ పై నమోదైన కేసును కొట్టివేస్తున్నట్టు తీర్పు
వెలువరించింది.

Read more RELATED
Recommended to you

Latest news