బండి సంజయ్ కి బిగ్‌ షాక్‌..రూ. 50 వేలు చెల్లించాలని హైకోర్టు ఆదేశం !

-

బండి సంజయ్ కి బిగ్‌ షాక్‌ తగిలింది. రూ. 50 వేలు చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది. ఇవాళ మంత్రి గంగుల కమలాకర్ ఎన్నిక వివాదంపై హైకోర్టు విచారణ జరిగింది. కరీంనగర్ ఎమ్మెల్యేగా గంగుల కమలాకర్ ఎన్నిక చెల్లదన్న బండి సంజయ్ పిటిషన్ పై విచారణ జరిగింది. పిటిషన్ వేసిన భాజపా నేత బండి సంజయ్ తీరుపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. క్రాస్ ఎగ్జామినేషన్ కు హాజరయ్యేందుకు పలుమార్లు గడువు కోరడంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది.

క్రాస్ ఎగ్జామినేషన్ కు జూలై 21 నుంచి మూడుసార్లు గడువు కోరారు బండి సంజయ్. బండి సంజయ్ అమెరికాలో ఉన్నందున గడువు ఇవ్వాలని ఇవాళ మరోసారి కోరారు న్యాయవాది. ఎన్నికల పిటిషన్లు ఆరు నెలల్లో తేల్చాల్సి ఉన్నందున.. విచారణ ముగిస్తామని హై కోర్టు పేర్కొంది. ఈ నెల 12న అమెరికా నుంచి వచ్చాక బండి సంజయ్ హాజరవుతారని అభ్యర్థించారు న్యాయవాది. అయితే.. సైనిక సంక్షేమ నిధికి రూ. 50 వేలు చెల్లించాలని బండి సంజయ్ కి హైకోర్టు ఆదేశించింది. క్రాస్ ఎగ్జామినేషన్ కు హాజరు కావాలంటే సంజయ్ రూ.50 వేలు చెల్లించాలన్న హైకోర్టు…విచారణ ఈనెల నెల 20 కి వాయిదా వేసింది.

Read more RELATED
Recommended to you

Latest news