కేసీఆర్ కుటుంబాన్ని కాపాడుతుంది కాంగ్రెస్ : మహేశ్వర్ రెడ్డి

-

కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతి నీ ఆధారాలతో సహా ప్రజల ముందు ఉంచాము. కానీ ఈ రోజు కొత్తగా కేటీఆర్ బీజేపీ ఏమీ చేయనట్టుగా మాట్లాడుతున్నారు అని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి అన్నారు. మా పార్టీ ఇంకా బతికే ఉందని చెప్పడానికి కేటీఆర్ ఇప్పుడు కళ్ళు తెరిచి మాట్లాడుతున్నారు. బీజేపీ ఎప్పుడు నిఖర్షుగా నిక్కచ్చిగా పోరాడుతుంది. కేసీఆర్ కుటుంబాన్ని ఢిల్లీ కాంగ్రెస్ కాపాడుతున్నది. KC వేణుగోపాల్ తో కేటీఆర్ హరీష్ రావు మాట్లాడుకున్నారు. కాంగ్రెస్ తో కలవడాన్ని రేవంత్ రెడ్డి వ్యతిరేకిస్తున్నారు.

మీరు ఇప్పుడు పొంగులేటి మధ్యవర్తిత్వం చేస్తున్నారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ ల పై కేటీఆర్ మాట్లాడడం సబబు కాదు. మీ మీద ఇప్పటి వరకు సీబీఐ, ఈడి విచారణకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఎంక్వైరీ అడగడం లేదు. మేము మా కేంద్రానికి అన్ని ఆధారాలు ఇచ్చాము.. చర్యలు ఉంటాయి. సివిల్ సప్లై మీద విజిలెన్స్ కమిటీ రాబోతుంది. FCI విచారణ జరుగుతుంది. సీబీఐ వచ్చే రోజు కూడా దగ్గరలోనే ఉంది. మీరు చేసిన లక్షల కోట్ల అవినీతి బయటకు వస్తుంది.. సీబీఐ పై రాష్ట్రం లో అనుమతి లేకుండా రావొద్దని ఉత్తర్వులు ఇచ్చిందే మీ ప్రభుత్వం కాదా. అమృత్ విషయం లో నేను అసెంబ్లీ మాట్లాడాను అని మహేశ్వర్ రెడ్డి అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version