ధర్మవరంలో ఉద్రికత్త.. కేతిరెడ్డి వాహనాన్ని అడ్డగించిన బీజేపీ, టీడీపీ కార్యకర్తలు..!

-

ధర్మవరం పట్టణంలో ఉద్రికత్త పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడ రిమాండ్ లో ఉన్న వైసీపీ కార్యకర్తలను పరామర్శించేందుకు ధర్మవరం సబ్ జైలుకి వెళ్లారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి. కానీ అదే సమయంలో సబ్ జైలు బయట ఉన్న వైసీపీ కార్యకర్తలకు బీజేపీ, టీడీపీ కార్యకర్తలు ఎదురుపడ్డారు. దాంతో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది.

ఈ క్రమంలోనే కేతిరెడ్డి వాహనాన్ని బీజేపీ , టీడీపీ కార్యకర్తలు కలిసి అడ్డగించారు. అయితే కారు అడ్డగించడంతో.. తప్పించుకునేందుకు కార్యకర్తల పైకి దూసుకెళ్లాడు కేతిరెడ్డి కారు డ్రైవర్. దాంతో కారు బ్యానెట్ పై ఎక్కాడు ఓ కార్యకర్త. కానీ కేతిరెడ్డి కారు డ్రైవర్ వేగంగా దూసుకెళ్లడంతో కారు బ్యానెట్ పై నుంచి కిందపడ్డాడు కార్యకర్త. దీంతో సబ్ జైలు వద్దకు చేరుకున్నారు కూటమి కార్యకర్తలు. అయితే సబ్ జైలు వద్ద ఉద్రిక్తత ఉన్న సమయంలో జైలు లోపల ఉన్నారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version