బీజేపీ పార్టీ కార్యకర్త సాయిగణేశ్​ ప్రేమికురాలు ఆత్మహత్యాయత్నం

-

ఖమ్మం జిల్లా బీజేపీ పార్టీ కార్యకర్త సాయి గణేష్‌ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే…. ఈ నెల 14వ తేదీన ఆత్మహత్య చేసుకున్న సాయి గణేష్‌ పెళ్లి చేసుకోవాల్సిన విజయ అనే యువతి నిద్ర మాత్రంలు మింగేసి.. ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేసింది. బీజేపీ పార్టీ కార్యకర్త సాయి గణేష్‌… విజయల పెళ్లి.. మే 4వ తేదీన జరుగాల్సి ఉంది.

అయితే.. పోలీసుల వేధింపుల కారణంగా బీజేపీ నేత సాయి గణేష్‌…. ఈ నెల 14 వ తేదీన త్రీ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ వద్ద ఆత్మ హత్య యత్నం చేసుకోగా.. 16 వ తేదీన మృతి చెందాడు. ఈ సంఘటన పై ఇప్పటికే.. అధికార పార్టీ పై విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. మరోవైపున సాయి గణేష్‌ ను ప్రేమించిన విజయ అనే యువతి నిన్న మధ్యాహ్నం నుంచి జూబ్లీపురలో సాయి గణేష్‌ నిర్మించిన బీజేపీ పార్టీ స్తూపం వద్ద ఉండి పోయింది. నిద్ర మాత్రలు మింగి అపస్మారక స్థితిలోకి వెళ్లి పోయింది. ప్రస్తుతం ప్రభుత్వ ఆస్పత్రిలో విజయకు చికిత్స అందిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version