దుండిగల్ పురపాలిక బీజేపీ అధ్యక్షుడిగా బౌరంపేటకు చెందిన పీసరి కృష్ణారెడ్డి మూడు నెలల క్రితం నియామకమయ్యారు. ఇక తాజాగా మల్కాజ్ గిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్, జిల్లా బిజెపి అధ్యక్షులు మల్లారెడ్డి ఆదేశాల మేరకు స్థానిక సీనియర్ నాయకుల సహకారంతో పూర్తిస్థాయి కమిటీని శనివారం ప్రకటించారు. పార్టీ పురపాలిక ఉపాధ్యక్షులుగా ఎన్. రోజా , ఎ. ఆంజనేయులు ముదిరాజ్, ఎ. సాయి యాదవ్, ప్రధాన కార్యదర్శులుగా డి సీతారాం రెడ్డి, టి భాను గౌడ్ నియామకం అయ్యారు. కోశాధికారిగా కే ప్రశాంత్ ను నియమించారు.
కార్యదర్శులుగా తలారి రాజ్ కుమార్ కు అవకాశం
BJP పూర్తిస్థాయి కమిటీ నియామకంలో భాగంగా కార్యదర్శిగా తలారి రాజ్ కుమార్ కు అవకాశం కల్పించారు. ప్రజాసేవలో ఎప్పుడు ముందుండే… తలారి రాజు కుమార్ ను గుర్తించి భారతీయ జనతా పార్టీ కార్యదర్శి పదవి ఇచ్చారు. ఆయన తో పాటు కార్యదర్శులుగా లతా, నరసింహ చారి, శివ నాయక్ లు నియామకమయ్యారు.