నా టికెట్ పై స్పష్టత లేదు… పార్టీ టికెట్లపై బండి సంజయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

-

టికెట్లపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్. నాయకులకు, కార్యకర్తలకు వార్నింగ్ ఇచ్చారు. పార్టీ కోసం కష్టపడ్డ వారికి మాత్రమే ఎన్నికల్లో టికెట్లు వస్తాయని… వ్యక్తుల కోసం పనిచేసిన వారికి టికెట్లు రావని స్పష్టం చేశారు. కొంతమంది నాయకులు టికెట్లు ఇస్తామని కొందరిని తిప్పించుకుంటున్నారని… తిప్పంచుకునే వారికి, తిరుగుతున్న వారికి ఇద్దరికి టికెట్లు రావని స్పష్టం చేశారు. వ్యక్తి గత ప్రయోజనాల కోసం కొందరు పని చేస్తున్నారని సున్నితంగా హెచ్చరించారు బండి సంజయ్. బీజేపీలో ముఖ్యమంత్రి అవుతామని చెప్పుకున్నవారు ముఖ్యమంత్రులు కాలేదని గుర్తు చేశారు. స్వయంగా అధ్యక్షుడినైనా నా టికెట్ పై కూడా స్పష్టత లేదని చెప్పుకువచ్చారు. ఇటీవల జరిగిన యూపి ఎన్నికల్లో టికెట్లు ఇప్పిస్తామని చెప్పుకున్నవారికే టికెట్లు రాలేదని బండి సంజయ్ గుర్తు చేశారు. పాదయాత్రకు ముందు బండి సంజయ్ ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ జాతీయ ఆర్గనైజింగ్ సెక్రటరీ సంతోజీ కూడా టికెట్ల విషయంలో ఇదే విషయం స్పష్టం చేశారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version