Acharya: ‘ఆచార్య’ హంగామా మామూలుగా లేదు..దద్దరిల్లుతున్న థియేటర్లు

-

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన చిత్రం ‘ఆచార్య’. తండ్రీ తనయులు కలిసి నటించిన ఈ పిక్చర్ మోస్ట్ అవెయిటెడ్ ఫిల్మ్ కాగా, ఈ నెల 29న అది రిలీజ్ కానుంది. మంగళవారం ఈ సినిమా ట్రైలర్ థియేటర్స్ లో విడుదలైంది. సిల్వర్ స్క్రీన్ పై న చిరంజీవి, రామ్ చరణ్ లను చూసిన మెగా అభిమానులు ‘ఆచార్య’ అదరగొట్టేశాడని ఈలలు కొడుతున్నారు.

బాక్సాఫీసు రికార్డులకు గుణపాఠాలు చెప్పే రోజులు అతి దగ్గరలో ఉన్నాయని మెగా అభిమానులు అంటున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో వేదికగా ఆచార్య ట్రైలర్ హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేశారు మెగా ఫ్యాన్స్. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ ట్విట్టర్ అఫీషియల్ హ్యాండిల్ లో షూటింగ్ నాటి పిక్చర్స్ షేర్ చేయగా, వాటిని చూసి సినీ అభిమానులు మురిసిపోతున్నారు.

సదరు ఫొటోలో దర్శకులు కొరటాల శివ, రామ్ చరణ్, పూజా హెగ్డేలు కుర్చీలో అలా కూర్చొని ఉన్నారు. ఇక షూటింగ్ వీడియోలు సైతం యూట్యూబ్ లో ట్రెండవుతున్నాయి. మొత్తంగా ‘ఆచార్య’ చిత్రంతో మెగా మేనియా షురూ కాబోతున్నది. యూట్యూబ్‌లో 7 గంటలకు ఆచార్య ట్రైలర్ విడుదల కానుంది.

ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని 152 థియేటర్స్ లో ట్రైలర్ ఆల్రెడీ రిలీజ్ కాగా, అది చూసి అభిమానులు ‘జై చిరంజీవ, జై చరణ్’ అని అరిచి రచ్చరచ్చ చేస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించగా, చిరంజీవికి జోడీగా కాజల్ అగర్వాల్, రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే నటించారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version