బీజేపీ అవినీతిలో కాంగ్రెస్ ని మించిపోయింది – జగదీష్ రెడ్డి

-

వరంగల్ లో సీఎం కేసీఆర్ పై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు మంత్రి జగదీశ్ రెడ్డి. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొద్దిమంది కోసం దేశాన్ని తాకట్టు పెట్టిన ఘనుడు మోదీ అని విమర్శించారు. కెసిఆర్ కీర్తి ఢిల్లీకి తాకుతుందనే భయం మోడీకి పట్టుకుందన్నారు. బిజెపి అవినీతిలో కాంగ్రెస్ పార్టీని మించిపోయిందని.. గుజరాత్ లో కూలిన బ్రిడ్జిలే బిజెపి అవినీతికి సాక్షాలని అన్నారు.

అలాగే మధ్యప్రదేశ్, గుజరాత్, కర్ణాటకలో జరిగిన అవినీతే బిజెపి పాలనకు సాక్షమని తెలిపారు. వారి బండారం బయటపడుతుందనే భయంతోనే కేసీఆర్ పై మోడీ ఆరోపణలు చేస్తున్నాడని అన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణ అన్ని రంగాలలో దూసుకుపోతుందన్నారు. అవినీతి జాబితాలో తెలంగాణకు స్థానం లేదని మోడీకి తెలుసన్నారు జగదీశ్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version