రుణమాఫీ అనేది ఓ ఘరానా మోసం..!

-

నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో బీజేపీ ఎంపీ డీకే.అరుణ ప్రెస్ మీట్ నిర్వహిచారు. ఇందులో ఆమె రుణమాఫీ అనేది ఓ ఘరానా మోసం అని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రైతుకు రుణమాఫీ జరగలేదని.. వెంటనే అందరికి చేయాలంటూ డీకే అరుణ రాష్ట్ర ప్రభుత్వం పై విమర్శలు గుప్పించింది రైతు రుణమాఫీ పేరుతో రాష్ట్ర రైతాంగాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం మోసం చేస్తుంది అని పేర్కొన్నారు.

అయితే రుణమాఫీ ఒక మోసం అని పేర్కొన డీకే అరుణ.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులలో 30 శాతం మంది రైతులకు కూడా రుణమాఫీ కాలేదు అని తెలిపారు. నిబంధనల పేరుతో రైతులను అయోమయానికి గురి చేస్తున్నారు అని అన్నారు. అలాగే ఇంట్లో ఒకరికే రుణమాఫీ చేస్తామంటూ.. రేషన్ కార్డు అంటూ.. అడ్డమైన సాకులు చెప్తూ రైతన్నలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుంది అని డీకే అరుణ తెలిపారు. ప్రతి రైతుకు రుణమాఫీ జరిగేవరకు బీజేపీ ప్రశ్నిస్తూనే ఉంటుంది అని ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Latest news