3 రోజులపాటు వరంగల్‌ లో పర్యటించనున్న గవర్నర్..!

-

తెలంగాణ రాష్ట్ర గవర్నర్​ జిష్ణుదేవ్‌ వర్మ ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో పర్యటించనున్నారు. రేపటి నుంచి మూడు రోజులపాటు ఆయన పర్యటన కొనసాగనుంది. రేపు యాదాద్రి ఆలయం దర్శించుకోనున్న గవర్నర్.. అక్కడి నుంచి ములుగుకు చేరుకుంటారు. అక్కడ వివిధ రంగాల్లో విశేష ప్రతిభ చూపిన అవార్జు గ్రహీతలతో సమావేశమవుతారు. యునెస్కో గుర్తింపు పొందిన కాకతీయ కళా ఖండం రామప్ప ఆలయాన్ని వీక్షించి లక్నవరంకు వెళ్లనున్నారు.

రేపు రాత్రి లక్నవరం లో బస చేసి మరుసటి రోజు హనుమకొండలో పేరొందిన కళాకారులు, ప్రముఖులతో సమావేశం కానున్నారు. అనంతరం వరంగల్ ఖిల్లాను, భద్రకాళీ, వేయిస్తంభాల ఆలయాలను గవర్నర్ సందర్శిస్తారు. రాత్రి వరంగల్ నిట్ గెస్ట్ హౌస్ లో బస చేస్తారు. ఇక మూడో రోజు జనగామ జిల్లాలో కవులు, కళాకారులతో సమావేశమై అక్కడి నుంచి కొలనుపాకను సందర్శిస్తారు. అయితే గవర్నర్ పర్యటనకు నాలుగు జిల్లాల యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేశారు. గవర్నర్ పర్యటన నేపథ్యంలో లో మంత్రి సీతక్క అధికారులు చేపట్టిన ఏర్పాట్లను పరిశీలించి పలు సూచనలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news