రాజాసింగ్ పై సస్పెన్షన్ ఎత్తివేయనున్న బిజెపి..మొదటి లిస్ట్‌ లో పేరు !

-

రాజాసింగ్‌ కు గుడ్‌ న్యూస్‌ చెప్పేందుకు బీజేపీ పార్టీ సిద్ధం అవుతోది. అసెంబ్లీకి పోటీ చేసే బిజెపి పార్టీ అభ్యర్థుల జాబితా ఇవాళ విడుదల కానుంది. 50 మందితో కూడిన ఈ జాబితాను ఇప్పటికే బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ ఆమోద ముద్ర వేసినట్లు తెలుస్తోంది. కిషన్ రెడ్డి మరియు లక్ష్మణులు అసెంబ్లీ బారిలో ఉండడం లేదని సమాచారం అందుతోంది. ఇక ఈటల రాజేందర్ హుజరాబాద్ మరియు గజ్వేల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే భారత రాష్ట్ర సమితి పార్టీ దాదాపు తమ జాబితాను వెల్లడించింది. కాంగ్రెస్ పార్టీ కూడా 55 స్థానాలకు లిస్టును ప్రకటించింది. ఇక ఇవాళ బిజెపి పార్టీ కూడా 55 మంది లిస్టు ప్రకటించబోతుంది. ఈరోజు ఉదయం 11 గంటలకు మరోసారి నడ్డాతో సమావేశం తర్వాత తుది జాబితాను సిద్ధం చేసి.. పార్లమెంటరీ బోర్డు సమావేశానికి పంపనున్నారు. అందులో చర్చించి ఇవాళ సాయంత్రం అభ్యర్థులను ప్రకటించనున్నారు. అయితే…రాజాసింగ్ పై సస్పెన్షన్ ఎత్తివేసే అలోచన లో బిజెపి ఉన్నట్లు సమాచారం. మొదటి జాబితాలో గోషామహల్ నుంచి రాజసింగ్ పేరు కూడా రానున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version