బీఆర్ఎస్ బీ ఫామ్‌ల పంపిణీ పూర్తి.. అలంపూర్‌లో సిట్టింగ్ అభ్యర్థి మార్పు

-

తెలంగాణ శాసనసభ ఎన్నికల కోసం భారత్ రాష్ట్ర సమితి బీ ఫారాల పంపిణీ పూర్తయింది. ఇప్పటికే 110 మందికి బీ ఫారాలు అందజేయగా.. తాజాగా మిగిలిన తొమ్మిది స్థానాలకు బీ ఫామ్​ల పంపిణీ పూర్తి చేసింది.  బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్.. అభ్యర్థులకు బీ ఫారాలు అందించారు.

అలంపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహంకు ఇప్పటికే టికెట్ ప్రకటించగా… ఆయన స్థానంలో మరొకరికి బీ ఫామ్ అందించారు. దాంతో పాటు గోషామహల్ అభ్యర్థిగా నంద కిషోర్ వ్యాస్ బిలాల్ కు బీఫామ్ ఇచ్చారు. చాంద్రాయణగుట్ట అభ్యర్థిగా  సీతారాం రెడ్డి, యాకత్ పురా అభ్యర్థిగా  సామా సుందర్ రెడ్డి,  బహదూర్ పురా అభ్యర్థిగా  ఇనాయత్ అలీబాక్రీకి  మంత్రి కేటీఆర్ బీ ఫారాలు పంపిణీ చేశారు. మలక్​పేటలో తీగల అజిత్ రెడ్డి, కార్వాన్ లో అయిందాల కృష్ణ, చార్మినార్ లో సలావుద్దీన్ లోడి, నాంపల్లి నుంచి సీహెచ్ ఆనంద్ కుమార్ గౌడ్ కు బీ ఫారాలు ఇచ్చారు. దీంతో 119 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు బీ ఫారాలు అందుకున్నట్లైంది.

Read more RELATED
Recommended to you

Latest news