టికెట్​ కోసం ఇంకా BRS నేతల ప్రయత్నాలు.. ప్రగతి భవన్​కు పరుగులు

-

రానున్న అసెంబ్లీ ఎన్నికల కోసం బీఆర్ఎస్ సమాయత్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ 105 స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తారనే ప్రచారం సాగుతోంది. ఈ ప్రచారానికి బలం చేకూరుస్తూ.. పలువురు నేతలు ప్రగతి భవన్​కు పరుగులు తీస్తున్నారు. చివరి నిమిషంలోనూ తమకు టికెట్ దక్కుతుందన్న ఆశతో పైరవీలు షురూ చేశారు.

ఇందులో భాగంగానే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను హైదరాబాద్‌లోని తన నివాసంలో పలువురు నేతలు కలిశారు. కవితను కలిసిన వారిలో నేతలు రేఖా నాయక్‌, ఎన్‌.సంజయ్‌, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఎల్‌.రమణ, సునీతా లక్ష్మారెడ్డి, బొంతు రామ్మోహన్‌, చంద్రావతి, మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌ రావు, కొప్పుల ఈశ్వర్ ఉన్నారు. మంత్రి హరీశ్‌ రావును కూడా పలువురు నేతలు కలిసినట్లు తెలుస్తోంది.

ఆశావహులను కలిసిన అనంతరం మంత్రి హరీశ్‌, ఎమ్మెల్సీ కవిత ప్రగతిభవన్‌కు బయలుదేరారు. ఈ క్రమంలో సిట్టింగ్‌ ఎమ్మెల్యేల్లో ఎంతమందికి టికెట్లు దక్కే అవకాశముంది? మొదటి జాబితాలో ఉండని నియోజకవర్గాలేమిటి? అనే చర్చ బీఆర్ఎస్ వర్గాల్లో చర్చనీయాంశవుతోంది. ఇక మరి కాసేపట్లో ఎవరికి ఛాన్స్ వస్తుందో.. కేసీఆర్ ఎవరికి హ్యాండ్ ఇస్తారో తెలిసిపోనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version