సీఎం రేవంత్ కు కాంగ్రెస్ లో చేరిన BRS ఎమ్మెల్యేలు ఝలక్ !

-

సీఎం రేవంత్ కు కాంగ్రెస్ లో చేరిన బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఝలక్ ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీటింగ్ కు నగర ఎమ్మెల్యేల డుమ్మా కొట్టారు. బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలు కూడా హాజరుకాకపోవడం హాట్ టాపిక్ ఐంది. తాజా పరిణామాల నేపత్యం లో సీఎం రేవంత్ రెడ్డి పై గుర్రుగా ఉన్నట్టు సమాచారం అందుతోంది.

BRS MLAs who joined Congress to CM Revanth

బీజేపీ ఎంపీ మినహా సొంత పార్టీ నాయకులతోనే సమావేశం నిర్వహించారట సీఎం రేవంత్ రెడ్డి. గణేష్ ఉత్సవాల నిర్వహణపై సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వర్ రావు, దామోదర రాజనర్సింహ, సీతక్క, ఎంపీలు అనిల్ కుమార్ యాదవ్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు, జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ, ఇతర ఉన్నతాధికారులు, గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులు…. ఈ సమావేశానికి హాజరు అయ్యారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version