BREAKING: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ భేటీ

-

BRS MLC Challa Venkatamireddy met with CM Revanth Reddy:  బీఆర్‌ఎస్‌ పార్టీకి బిగ్‌ షాక్‌ తగిలింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి వెళ్లారు. రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు.

BRS MLC Challa Venkatamireddy met with CM Revanth Reddy

రేపు (మంగళవారం) సీఎం మహబూబ్‌నగర్ పర్యటనలో చల్లా కాంగ్రెస్‌లో చేరనున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డితో పాటు అలంపూర్‌ ఎమ్మెల్యే విజేయుడు కూడా కాంగ్రెస్‌ పార్టీలో చేరే ఛాన్స్‌ ఉందని సమాచారం.

కాగా, బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు, ఏడుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాజాగా అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. అలంపూర్ ఎమ్మెల్యే కాంగ్రెస్‌లో చేరితే ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో బీఆర్ఎస్ ఖాళీ కానుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version