BREAKING : తమ పదవులకు కడియం,కౌశిక్‌, పల్లా రాజీనామా

-

BREAKING : తమ పదవులకు బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు బీఆర్ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి , కడియం శ్రీహరి , పాడి కౌశిక్ రెడ్డి. ఈ తరుణంలోనే.. పల్లా రాజేశ్వర్ రెడ్డి , కడియం శ్రీహరి , పాడి కౌశిక్ రెడ్డి రాజీనామాలకు ఆమోదం తెలిపారు తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి.

Palla and Kadiyam

ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. కాగా. స్టేషన్‌ ఘనపూర్‌ నుంచి కడియం శ్రీహరి ఎమ్మెల్యే గా విజయం సాధించిన సంగతి తెలిసిందే. అటు హుజురాబాద్‌ నుంచి పాడి కౌశిక్‌ రెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అలాగే.. జనగామ నియోజక వర్గం నుంచి పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యేగా మొట్ట మొదటి సారిగా విక్టరీ కొట్టారు. దీంతో పల్లా రాజేశ్వర్ రెడ్డి , కడియం శ్రీహరి , పాడి కౌశిక్ రెడ్డి ముగ్గురు ఇవాళ తెలంగాణ ఎమ్మెల్యేలుగా అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news