సంగారెడ్డి నియోజకవర్గ అధికారులకు జగ్గారెడ్డి హెచ్చరికలు !

-

సంగారెడ్డి నియోజకవర్గ అధికారులకు జగ్గారెడ్డి హెచ్చరికలు జారీ చేశారు. ఎమ్మెల్యే గా గెలవకపోయినా..తన మాట వినాలనే ధోరణి ప్రదర్శిస్తున్నారు. ఇందులో భాగంగానే సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సంగారెడ్డి నియోజకవర్గ అధికారులు నా సూచనలు పాటించాలని కోరారు.

ఇక నుంచి సంగారెడ్డి నియోజకవర్గంలో జరిగే ప్రభుత్వ కార్యక్రమానికి నా భార్య నిర్మల జగ్గారెడ్డిని పిలవాలని వెల్లడించారు. గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఓడిపోయిన ఎమ్మెల్యేనే అన్ని ప్రభుత్వ కార్యక్రమాలు చేసేవారన్నారు. అయినా నేను హుందాగా వ్యవహారించాను ..ఏమి అనలేదని మండిపడ్డారు. ఇప్పుడు కొన్ని పరిస్థితుల వాళ్ళ నేను ఓడిపోయినా.. కానీ ప్రభుత్వం కాంగ్రెస్ వచ్చిందని ఫైర్‌ అయ్యారు. నా తరుఫున ఇక నుంచి ప్రతి ప్రభుత్వ కార్యక్రమానికి నా భార్య నిర్మల హాజరవుతుందని స్పష్టం చేశారు సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news