సీతారామ ప్రాజెక్ట్ రేవంత్ రెడ్డి కట్టించాడా? ఇజ్జత్‌ తీసిన తాత మధు !

-

రేవంత్ రెడ్డి నిన్న ఖమ్మం వచ్చి పిచ్చి పిచ్చిగా మాట్లాడాడని ఆగ్రహించారు బీఆర్‌ఎస్‌ నేత, ఎమ్మెల్సీ తాతా మధు. అసలు సీతారామ ప్రాజెక్టు గురించి రేవంత్ రెడ్డికి ఏమైనా తెలుసా? సీతారామ ప్రాజెక్ట్ రేవంత్ రెడ్డి కట్టించాడా? అని నిలదీశారు. రేవంత్ రెడ్డి నిన్న ఖమ్మం లో మాట్లాడిన తీరు జుగుప్సాకరంగా ఉందని ఫైర్‌ అయ్యారు ఎమ్మెల్సీ తాతా మధు. ఆయన భాష తెలంగాణ ప్రజలు సిగ్గుపడేలా ఉన్నాయని… సీతారామ ప్రాజెక్ట్ ప్రారంభం కు వెళ్లి ఈ భాష ఏంటి? అంటూ ప్రశ్నించారు.

brs thatha madhu slams cm revanth

కేసిఆర్ నిర్మించిన ప్రోజెక్ట్ రైతులకు లాభం జరగాలని చూసారని… ఆ ప్రాజెక్ట్ ప్రారంభానికి వెళ్లి రైతులను ఉద్దేశించి మాట్లాడాలని కోరారు. కానీ సిగ్గు లజ్జ లేకుండా సభ్య సమాజం తలదించుకునేలా ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఇలాంటి మాటలు మాట్లాడటం సిగ్గుచేటు అంటూ నిప్పులు చెరిగారు ఎమ్మెల్సీ తాతా మధు. ఉద్యమాన్ని నడిపి, 60 లక్షల సభ్యత్వం ఉన్న పార్టీని నడుపుతున్న కేసిఆర్ హరీష్ రావు లను ఉద్దేశించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడారన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news