కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ మంత్రి చంద్రశేఖర్

-

మాజీ మంత్రి ఏ.చంద్రశేఖర్ బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జీ మాణిక్ రావు ఠాక్రె సమక్షంలో ఆయనతో పాటు పలువురు నేతలు హస్తం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు వారికి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

ఈ సంరద్భంగా మాజీ మంత్రి చంద్రశేఖర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీఆర్ఎస్ ని ఓడించడం కాంగ్రెస్ పార్టీకే సాధ్యం అన్నారు. వికారాబాద్ ప్రజలు తనను ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారని.. ఈసారి తాను జహీరాబాద్ నుంచి పోటీలో ఉంటున్నట్టు వెల్లడించారు. బీజేపీ సభకు శాలువా తీసుకువెళ్లితే.. దళితుడినని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తీసుకోలేదన్నారు. 70 ఏళ్ల తరువాత కూడా అసమానత్వం ఉన్నదని వాపోయారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆయన జోస్యం చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కాంగ్రెస్ వైపునకే మొగ్గు చూపుతున్నారని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version