Chiranjeevi: కేసీఆర్‌ను పరామర్శించిన చిరంజీవి..

-

Chiranjeevi visited KCR : తెలంగాణ మొట్ట మొదటి సీఎం కేసీఆర్ ప్రస్తుతం ఆస్పత్రిలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో ప్రముఖులు కేసీఆర్ ను పరామర్శిస్తున్నారు. అయితే.. తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఈ జాబితాలో చేరారు. కొద్దిసేపటి కిందటే యశోద ఆసుపత్రి చేరుకున్నారు. మాజీ మంత్రి కేటీఆర్, బీఆర్ఎస్ శాసనమండలి సభ్యురాలు కవితను కలిసారు.

Chiranjeevi visited KCR

వారితో కలిసి నేరుగా కేసీఆర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్న గదికి వెళ్లారు. కేసీఆర్ ఆరోగ్య సమాచారాన్ని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. ఆ సమయంలో చిరంజీవి వెంట బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఉన్నారు. కెసిఆర్ కు అందిస్తున్న ట్రీట్మెంట్ పై చిరంజీవికి అప్డేట్స్ ఇచ్చారు. డాక్టర్లు ఆయనకు అందిస్తున్న వైద్యం గురించి వివరించారు. తుంటి ఎముక రీప్లే స్ చేశామని, ఇప్పుడిప్పుడే వాకర్ సహాయం తో నడవగలుగుతున్నారని డాక్టర్లు చెప్పా రు.

Read more RELATED
Recommended to you

Latest news