రేపటి తెలంగాణ మీది..నేను ఉండలేను కదా – సీఎం కేసీఆర్

-

తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. రేపటి తెలంగాణ మీది.. భవిష్యత్తు మీది.. నేను తోవ మాత్రమే చూపించిపోతానంటూ ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు సీఎం కేసీఆర్. నా ఏజ్‌ ఇప్పుడు 69 ఏళ్లు.. ఫిబ్రవరిలో 70 ఏళ్లు పడతాయి… ఇక తెలంగాణ మీదే అంటూ పేర్కొన్నారు సీఎం కేసీఆర్‌. యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు అనిల్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరారు.

సీఎం కేసీఆర్ సమక్షంలో ఆయన గులాబీ కండువా కప్పుకున్నారు. అనిల్‌కుమార్‌ రెడ్డి చేరిక సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడారు. తెలంగాణలో రైతుల పరిస్థితి మెరుగుపడిందని.. ధరణి పోర్టల్‌ తెచ్చి భూములను డిజిటలైజేషన్‌ చేశామని తెలిపారు. ధరణి ద్వారా యజమానులు మాత్రమే భూమి ఇతరులపైకి మార్చగలరని అన్నారు. ధరణిని తీసేస్తే రైతు బంధు నిధులు ఎలా జమ అవ్వాలి? అని కేసీఆర్ ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news