జూనియర్ లైన్‌మెన్‌ను సత్కరించిన సీఎం కేసీఆర్

-

జూనియర్ లైన్‌మెన్‌ను సత్కరించారు తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్. తెలంగాణలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లాయి. జనగాం జిల్లా దేవరుప్పుల మండలం చింతల తండా, ధర్మాపురం, పడమటి తండా గ్రామాలకు విద్యుత్ ఇవ్వడం కోసం ప్రాణాలకు తెగించి వరదలో ఈదుకుంటూ వెళ్లి విద్యుత్ సమస్య సరిచేసిన జూనియర్ లైన్‌మెన్‌ ఎండీ రహమాన్‌ను ఆగస్ట్ 15 స్వాతంత్ర్య దినోత్సవం రోజున సత్కరించిన సీఎం కేసీఆర్.

ఉద్యోగులకు కొత్తగా పీఆర్సీ నియమించి, జీతాలు పెంచుతామని కీలక ప్రకటన చేశారు సీఎం కేసీఆర్‌. త్వరలోనే కొత్తగా పీఆర్సీ నియమించి, ఉద్యోగుల వేతనాలను పెంచుతామని, అప్పటివరకూ మధ్యంతర భృతిని చెల్లిస్తామని ఇటీవలి శాసనసభా సమావేశాల్లో నేను స్వయంగా ప్రకటించానని గుర్తు చేశారు సీఎం కేసీఆర్‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version