రెండు చోట్ల నుంచి సీఎం కేసీఆర్‌ పోటీ..!

-

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవాళ టిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించారు. తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి అభ్యర్థులను వివరించారు. ముఖ్యంగా ఏడు స్థానాల్లో మార్పులు చేసినట్టు తెలిపారు. ఏడు అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను మార్చిన బీఆర్ఎస్‌ అధినేత కేసీఆర్.. స్టేషన్‌ఘన్‌పూర్‌, ఉప్పల్‌, వేములవాడ, ఖానాపూర్‌, బోథ్‌, కామారెడ్డి అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల మార్పులు చేశారు.

అదేవిధంగా నాలుగు నియోజకవర్గాలను పెండింగ్ లో ఉంచారు సీఎం కేసీఆర్.  ర్సాపూర్, జనగాం, గోషామహల్‌, నాంపల్లి స్థానాలకు ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు. త్వరలోనే పెండింగ్ లో ఉంచిన నియోజకవర్గాలను ప్రకటించనున్నారు. తాజాగా 115 అసెంబ్లీ నియోజకవర్గం ప్రకటించారు.  అక్టోబర్ 16 న వరంగల్ లో భారీ ర్యాలీ ఉంటుంది.. అదేరోజు టిఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టో ఉంటుందని వెల్లడించారు కేసీఆర్. 95 నుంచి 105 సీట్లు గెలుస్తాం.. నేతల విజ్ఞప్తితోనే కామారెడ్డిలో పోటీ చేస్తున్నట్టు స్పష్టం చేశారు కేసీఆర్. సికింద్రాబాద్ నుంచి సాయన్న కూతురుకి సీటు కేటాయించారు కేసీఆర్.

 

Read more RELATED
Recommended to you

Latest news