హుజూరాబాద్ లో 17న సీఎం కేసీఆర్ సభ

-

హుజురాబాద్ లో BRS అసెంబ్లీ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు కౌశిక్ రెడ్డి. తెలంగాణలో సీఎంగా కేసీఆర్ మూడోసారి కాబోతున్నాడు అని పేర్కొన్నారు. హుజురాబాద్ ని 1000 కోట్ల తో సిద్దిపేట వలే తీర్చి దిద్దుతానని పేర్కొన్నారు. జమ్మికుంట లో నేడు 50 వేల మంది తో రోడ్ షో పాల్గొననున్న హరీష్ రావు. బీఆర్ఎస్ పై ప్రజల్లో అద్భుతమైన స్పందన ఉందని.. నవంబర్ 17న సీఎం సభను లక్ష మందితో నిర్వహిస్తామని తెలిపారు.

కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో టూరిజం కార్పొరేషన్ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ.. హుజురాబాద్ లో బిఆరెస్ విజయపరంపర కొనసాగుతుంది. కౌశిక్ రెడ్డి ని ఓడించడానికి కేంద్ర మంత్రులు అవసరమా ఈటల అని ప్రశ్నించారు. ఈటల కు ఓటమి భయం పట్టుకుంది ఆయనకు డిపాసిట్ కూడా దక్కదు అన్నారు. సీఎం పై గౌరవ పరంగా ఓడిపోయిన అని చెప్పుకోవడానికి గజ్వెల్ లో పోటీ చేస్తున్నాడు. హుజురాబాద్ లో కాంగ్రెస్ లేనే లేదు అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news