నేడు కలెక్ట‌ర్ల తో సీఎం కేసీఆర్ భేటీ

-

తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఈ రోజు అన్ని జిల్లాల క‌లెక్ట‌ర్ల‌తో స‌మావేశం నిర్వ‌హించ‌నున్నారు. రాష్ట్రంలో ప‌థ‌కాల అమ‌లు, వ్య‌వ‌సాయం తో పాటు ద‌ళిత బందు ప్ర‌ధాన ఎజెండా గా స‌మావేశం సాగ‌నుంది. అలాగే వ‌రికి ప్ర‌త్యామ్నాయ పంట‌ల సాగు పై కూడా కలెక్ట‌ర్ల‌తో సీఎం కేసీఆర్ చ‌ర్చించ‌నున్నారు. ఈ రోజు స‌మావేశం లో అన్ని జిల్లాల కలెక్ట‌ర్ల‌తో పాటు మంత్రులు కూడా సమావేశం లో పాల్గొనున్నారు. ఈ స‌మావేశం హైద‌రాబాద్ లోని ప్ర‌గ‌తి భ‌వ‌న్ వేదికగా జ‌ర‌గ‌నుంది.

ముఖ్యం గా ద‌ళిత బందు పై సుదీర్ఘంగా చ‌ర్చించే అవ‌కాశం ఉంది. ఇప్ప‌టికే రాష్ట్ర వ్యాప్తం గా పైల‌ట్ ప‌ద్ద‌తిగా చింత‌కాని, తిరుమ‌ల‌గిరి, చార‌కొండ, నిజాం సాగ‌ర్ మండ‌లాల్లో ఈ ప‌థ‌కాన్ని అమ‌లు చేస్తున్నారు. అలాగే యాదాద్రి జిల్లా లోని వాసాల‌మ‌ర్రి లో ఇప్ప‌టికే ప‌లువురికి పంపిణీ కూడా జ‌రిగింది. అయితే ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రం లో అన్ని జిల్లాలో ద‌ళిత బందు అమ‌లు చేస్తాన‌ని సీఎం కేసీఆర్ ప్రక‌టించిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యం లో జిల్లా క‌లెక్ట‌ర్ల‌కు దళిత బంధు పై ప‌లు సూచ‌న‌లు చేయ‌నున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news