ఇవాళ హుస్నాబాద్ కు సీఎం కేసీఆర్…యుద్ధ భూమిలోకి దిగుతున్న గులాబీ బాస్

-

ఇవాళ్టి నుంచి సీఎం కేసీఆర్‌ ఎన్నికల యుద్ధ భూమిలోకి అడుగపెట్టనున్నారు. హుస్నాబాద్‌ లో మొదటి ఎన్నికల ప్రచార సభ లో పాల్గొననున్నారు సీఎం కేసీఆర్‌. అటు ఇవాళ మధ్యాహ్నం 12:15 గంటలకు బీఆర్ఎస్ పార్టీ మానిఫెస్టో ప్రకటించనున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. ఇందులో భాగంగానే..ఇవాళ ఉదయం 11 గంటల తర్వాత తెలంగాణ భవన్ కు కేసీఆర్ చేరుకుంటారు. ఈ సందర్భంగా అభ్యర్థులు, నియోజకవర్గాల ఇంఛార్జిలతో సమావేశం నిర్వహించనున్నారు సీఎం కేసీఆర్‌.

Husnabad sentiment to CM KCR

అనంతరం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంపై బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థులకు దిశా నిర్దేశం చేయనున్నారు గులాబీ బాస్‌ కేసీఆర్‌. ఆ తరువాత అభ్యర్థులకు బి ఫారాలు అందచేయనున్నారు కేసీఆర్. తదనంతరం BRS మ్యానిఫెస్టో విడుదల చేస్తారు సీఎం కేసీఆర్. BRS మేనిఫెస్టోలో.. మహిళలకు పెద్దపీట వేసే ఛాన్స్ ఉంది. ఇక ఆ తర్వాత ఇవాళ సాయంత్రం 4 గంటల సమయంలో హుస్నాబాద్ బయలుదేరుతారు. ఈ సందర్భంగా హుస్నాబాద్‌ లో మొదటి ఎన్నికల ప్రచార సభ లో పాల్గొననున్న కేసీఆర్… అనంతరం ప్రగతి భవన్‌ కు తిరిగి వస్తారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version