ఈ నెల 30న మునుగోడులో సీఎం కేసీఆర్ బహిరంగ సభ !

-

మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో టీఆర్‌ఎస్‌ పార్టీ చాలా ఊపులో ఉంది. అన్ని పార్టీల కన్నా పకడ్భందీగా ప్రచారం చేస్తోంది. అధికారాన్ని ఉపయోగించుకుని.. కూడా ప్రజల్లోకి దూసుకెళుతోంది. ఇక అటు మునుగోడు నియోజకవర్గం లో జేపీ నడ్డాకు టిఆర్ఎస్ శ్రేణులు సమాధి కట్టిన వ్యవహారం పెద్ద దుమారం లేపిన విషయం తెలిసిందే.

ఈ ఘటనపై రాష్ట్ర బిజెపి నేతలు సీరియస్ అయ్యారు. టిఆర్ఎస్ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో నేరుగా జేపీ నడ్డాతోనే టిఆర్ఎస్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇప్పించేలా బిజెపి నేతలు ప్లాన్ చేశారు.

ఈనెల 30న మునుగోడు ప్రచారానికి సీఎం కేసీఆర్ రానున్నారని తెలుస్తోంది. ఆరోజు చండూరులో కేసీఆర్ బహిరంగ సభ నిర్వహించనున్నారని సమాచారం. టిఆర్ఎస్ నేతలు ఇప్పటికే కేసీఆర్ బహిరంగ సభ ఏర్పాట్లలో మునిగిపోయినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత రోజే జేపీ నడ్డా రానుండటంతో మునుగోడు ఉప ఎన్నికల హీట్ మరింత పెరిగే అవకాశం ఉంది. కేసీఆర్ చేసే విమర్శలకు నడ్డా కౌంటర్ ఇచ్చే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version