నేడు హనుమకొండ జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన

-

పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం 15 ఎంపీ సీట్లైనా సాధించాలనే లక్ష్యంతో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆ దిశగా కార్యాచరణ ముమ్మరం చేసింది. ముఖ్యంగా పార్టీ పీసీసీ చీఫ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచారాన్ని ఉద్ధృతం చేశారు. రోజుకు రెండు మూడు నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ హన్మకొండ జిల్లాలో సీఎం రేవంత్ పర్యటించనున్నారు. మడికొండలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఓరుగల్లు ‘జన జాతర సభ’లో రేవంత్‌రెడ్డి పాల్గొననున్నారు. ఈ సభకు ముఖ్యమంత్రితో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక ఎంపీ అభ్యర్థులు, ఇతర నేతలు హాజరవ్వనున్నారు.

ఇప్పటికే రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు చేస్తున్న సీఎం రేవంత్ విపక్షాలపై తీవ్రంగా ధ్వజమెత్తుతున్నారు. పదేళ్లలో ఇటు రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్.. అటు కేంద్రంలో ఉన్న బీజేపీ తెలంగాణకు చేసిందేం లేదని మండిపడ్డారు. రెండు పార్టీలు ప్రజలను దోచుకున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీతోనే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీ కచ్చితంగా నెరవేరుస్తామని పునరుద్ఘాటించారు.

Read more RELATED
Recommended to you

Latest news