రాజీవ్‌గాంధీ సేవలు చిరస్మరణీయం: సీఎం రేవంత్‌

-

మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. ఐటీ రంగ వృద్ధికి రాజీవ్‌ గాంధీ బాటలు వేశారని అన్నారు. ఇవాళ రాజీవ్ గాంధీ వర్దంతి సందర్భంగా హైదరాబాద్లో నగరంలోని సోమాజిగూడలో వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ రెడ్డి ఆయన విగ్రహానికి నివాళి అర్పించారు. ప్రధానిగా దేశానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, జానా రెడ్డి, వి.హనుమంతరావు, షబ్బీర్ అలీ, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపాదాస్‌ మున్షీ తదితరులు పాల్గొన్నారు. మరోవైపు ఖమ్మం జిల్లా కూసుమంచిలో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి రాజీవ్‌ గాంధీ విగ్రహానికి నివాళి అర్పించారు. అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి పొన్నం ప్రభాకర్‌ అక్కడి న్యూయార్క్‌ టైమ్స్‌ స్క్వేర్‌ వద్ద నిర్వహించిన వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజీవ్ గాంధీ ఆనాడు చేపట్టిన కార్యాచరణ వల్లే నేడు దేశం సాంకేతిత రంగంలో విప్లవాత్మకమైన మార్పులు సాధించగలిగిందని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version