తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్… త్వరలోనే కొత్త రేషన్ కార్డులు

-

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్… త్వరలోనే కొత్త రేషన్ కార్డులు రాబోతున్నాయి. ఆరోగ్యశ్రీతో సంబంధం లేకుండా త్వరలోనే కొత్త రేషన్ కార్డులు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. సన్నబియ్యం పండించే రైతులను ప్రోత్సహిస్తామని వెల్లడించారు.

CM Revanth Reddy announced that new ration cards will be issued soon regardless of Arogyashri

వాటిని మిల్లింగ్ చేయించి రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ చేస్తామని తెలిపారు. బియ్యాన్ని వినియోగదారుల తింటారు కాబట్టి రీసైక్లింగ్ ఆగిపోతుందని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. అటు తెలంగాణకు రావలసిన నిధులు, బొగ్గుగనులు, విభజన చట్టంలోని హామీలు, రక్షణ భూముల బదలాయింపు వంటి 12 కీలకమైన అంశాలను సత్వరం పరిష్కరించాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి… ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దృష్టికి తెచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news