3 విడతల్లో రుణమాఫీ చేస్తాం : సీఎం రేవంత్ ప్రకటన

-

3 విడతల్లో రుణమాఫీ చేస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. రేపు సాయంత్రం 4గంటలకు రూ.లక్ష వరకు ఉన్న రైతురుణాలు మాఫీ చేస్తున్నామని తెలిపారు. రూ.7వేల కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లోకి వెళతాయని చెప్పారు. నెలాఖరులోగా రూ.లక్షన్నర వరకు ఉన్న రైతు రుణాలు మాఫీ చేస్తామని వివరించారు. ఆగస్టు లో రూ.2లక్షల వరకు రైతుల రుణమాఫీ చేసి రుణమాఫీ ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు సీఎం రేవంత్‌.

CM Revanth Reddy announced that new ration cards will be issued soon regardless of Arogyashri

రుణమాఫీ పేరుతో కేసీఆర్ లాగా మాటలు చెప్పి రైతులను మభ్యపెట్టడంలేదని… ఏకమొత్తంలో రూ. 2 లక్షల రుణమాఫీ పూర్తి చేస్తున్నామని వెల్లడించారు. ప్రజాభవన్ లో కాంగ్రెస్ కీలక నాయకులు సమావేశంలో సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ…రైతు ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికే రూ.2లక్షల రైతు రుణమాఫీ చేస్తున్నామన్నారు. మనం చేస్తున్న మంచి పనిని ప్రజలకు వివరించండని నేతలకు దిశా నిర్దేశం చేశారు. గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిల్లో కార్యక్రమాలు నిర్వహించండి…. రుణమాఫీ హామీని నిలబెట్టుకున్నామని సగర్వంగా చెప్పండని కోరారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version