ఇవాళ మణిపూర్ కు సీఎం రేవంత్ రెడ్డి పయనం..10 రోజుల పాటు !

-

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేపట్టనున్న భారత్ జోడో న్యాయ్ యాత్ర ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. ఈరోజు మణిపుర్‌ నుంచి ప్రారంభమవనున్న ఈ యాత్రను బస్సులో, కాలినడకన రాహుల్ సాగించనున్నారు. మణిపుర్ నుంచి ముంబయి వరకు ఈ యాత్ర కొనసాగనుంది.  ఇవాళ్టి నుంచి 67 రోజుల పాటు 6,173 కిలోమీట్ల మేర రాహుల్ యాత్ర సాగుతుంది.

CM Revanth Reddy is leaving for Manipur today

రాహుల్ గాంధీ న్యాయ యాత్రను చేపట్టనున్న తరుణంలో… ఇవాళ ఉదయం సీఎం రేవంత్ రెడ్డి మణిపూర్ కు వెళ్ళనున్నారు. తొలిరోజు న్యాయయాత్రలో పాల్గొన్న తర్వాత ఆయన ఢిల్లీకి తిరిగి వస్తారు. ఆ తర్వాత దావోస్ లో జరగనున్న ప్రపంచ ఆర్థిక సదస్సుకు వెళ్తారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. రాహుల్‌ యాత్రలో తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొంటారు. అటు ఏపీ నుంచి పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు, రఘువీరారెడ్డి, పల్లం రాజు పాల్గొంటారు.

Read more RELATED
Recommended to you

Latest news