భావి తరాలకు స్ఫూర్తి అంబేడ్కర్‌: సీఎం రేవంత్‌రెడ్డి

-

అంబేడ్కర్‌ జయంతి (ఏప్రిల్‌ 14)ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు. దేశ భవిష్యత్తును ముందుగానే ఊహించి దార్శనికతతో రాజ్యాంగాన్ని రూపొందించిన అంబేడ్కర్‌ భావితరాలకు స్ఫూర్తిగా నిలిచారని అన్నారు. బడుగు బలహీనవర్గాలు, మహిళా సాధికారతకు పాటుపడిన మహనీయుడు అంబేడ్కర్‌ అని కొనియాడారు. ప్రజల హక్కుల కోసం పోరాడి ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన అంబేడ్కర్‌ ఆశయ సాధనకు అందరూ కట్టుబడి ఉండాలని కోరారు.

ఆయన స్ఫూర్తితోనే కాంగ్రెస్‌ ప్రజా ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలు, వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి పాటుపడుతోందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. దళితుల అభ్యున్నతిలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని వివరించారు. ఎస్సీ, ఎస్టీల సమగ్రాభివృద్ధికి, వారి జీవన ప్రమాణాలను మెరుగు పరిచేందుకు ప్రత్యేక ప్రణాళికతో అడుగులు వేస్తోందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాలకు అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. ఇప్పటికే వారి అభ్యున్నతి కోసం పలు కార్యక్రమాలు రూపొందించినట్లు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news