బుల్లెట్ ఫ్రూప్ వాహనంలో సీఎం రేవంత్ రెడ్డి ఫస్ట్ రైడ్..!

-

తెలంగాణ ముఖ్యమంత్రి అయిన తరువాత ఫస్ట్ టైమ్ రేవంత్ రెడ్డి ప్రభుత్వ బుల్లెట్ ఫ్రూఫ్ బస్సుల ప్రయాణం చేశారు. హైదరాబాద్ నుంచి మేడిగడ్డ వరకు సహచర మంత్రులతో కలిసి వెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా సమకూర్చుకున్న బస్సులో గత ప్రభుత్వంలో అనేక టూర్లకు అప్పటి ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ వాడుకున్నారు. ఇప్పుడు మొదటిసారి రేవంత్ ఆ బస్సు ఎక్కారు. అధికారిక పర్యటనలో భాగంగా ఈ నెల 2న ఇంద్రవెళ్లి వెళ్లినా హెలికాప్టర్ ను వాడారు.

ఇప్పుడు మేడిగడ్డకు బ్యారేజీ డ్యామేజీని చూసేందుకు అన్ని పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలకు ఆహ్వానం పలికారు. బీజేపీ, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు లేకపోయినా.. కాంగ్రెస్, సీపీఐ, మజ్లిస్ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులతో కలిసి బస్సులోనే మేడిగడ్డ వరకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలోనూ అదే బస్సులో హైదరాబాద్ చేరుకోనున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news