బాచుపల్లి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం !

-

బాచుపల్లి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీసారు. రేణుక ఎల్లమ్మ కాలనీలో నిర్మాణంలో ఉన్న కూలిపోయిన గోడకూలీ ఏడు మంది చనిపోవడం పై సీఎం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్న సీఎం రేవంత్‌.. తప్పిదం ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కుండపోత వర్షం పడడం తో ఒక్కసారిగా గోడ కూలినట్లు సీఎం రేవంత్‌ కు తెలిపారు అధికారులు.

cm revanth reddy on may day

భవనానికి పక్కనే ఉన్న సెంట్రింగ్ పనిచేసే కార్మికుల్లో ఏడు మంది మృతి చెందారని.. మరో నలుగురికి గాయాలైనట్లు తెలిపారు అధికారులు. చనిపోయిన వారు ఒరిస్సా ఛత్తీస్ఘడ్ రాష్ట్రాలకు చెందిన వారిగా గుర్తించారు అధికారులు. చనిపోయిన వారిలో నాలుగు సంవత్సరాల బాబు, ఒక మహిళ, 4 పురుషులు ఉన్నారు. చనిపోయిన కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం హామీ ఇచ్చారు. గాయపడిన వారికి సరైన వైద్య చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్.

Read more RELATED
Recommended to you

Latest news