జాతీయ రహదారుల విస్తరణ, అభివృద్ధిపై నేడు సీఎం రేవంత్‌ సమీక్ష

-

జాతీయ రహదారుల విస్తరణ, అభివృద్ధిపై ఈరోజు (జులై 10వ తేదీ) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. జాతీయ రహదారుల పనులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అవసరమైన చర్యలు చేపట్టే విషయంపై ఈ సమీక్షలో చర్చించనున్నారు. ఎన్హెచ్ఏఐ ఉన్నతాధికారులు మంగళవారం రోజున ముఖ్యమంత్రిని కలిసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వారు పలు అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వ సహకారం కావాలని కోరారు.

NH-163లో మంచిర్యాల – వరంగల్‌ – ఖ‌మ్మం – విజయవాడ కారిడార్ నిర్మాణానికి భూములు అప్పగించాల్సి ఉందని ముఖ్యమంత్రికి తెలిపారు. NH-63లో ఆర్మూర్‌-జ‌గిత్యాల- మంచిర్యాల రహదారికి భూసేకరణ కోసం ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాల్సి ఉందని చెప్పారు. ఇక NH-563లో.. వరంగల్- కరీంనగర్ రహదారి నిర్మాణానికి చెరువు మట్టి, ప్లైయాష్ కావాలని పేర్కొన్నారు. NH-44తో కాళ్ల‌క‌ల్‌-గుండ్ల‌ పోచంప‌ల్లి ర‌హ‌దారి… ఆరు వ‌రుస‌లుగా విస్తరించేందుకు భూసేకరణ చేయాలని … ఖమ్మం- దేవరపల్లి, ఖమ్మం-కోదాడరహదారుల నిర్మాణంలో పోలీస్ భద్రత అవసరం ఉందని ముఖ్యమంత్రికి వివరించారు. ఆ వినతులపై స్పందించిన సీఎం.. సమస్యల పరిష్కారానికి నేడు ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version