10 రోజులు తెలంగాణకు దూరంగా ఉండనున్న సీఎం రేవంత్ !

-

సీఎం రేవంత్ రెడ్డి దాదాపు 10 రోజులు తెలంగాణ రాష్ట్రానికి దూరంగా ఉండనున్నారు. నిన్న సాయంత్రం ఢిల్లీ చేరుకున్న ఆయన…. ఇవాళ పలువురు కేంద్రమంత్రులు, కాంగ్రెస్ అగ్రనేతలతో సమావేశం అవుతారు.

CM Revanth will stay away from Telangana for 10 days
CM Revanth will stay away from Telangana for 10 days

రేపు మణిపూర్ లో రాహుల్ గాంధీ జోడో యాత్రలో పాల్గొంటారు. తర్వాత ఢిల్లీ నుంచి స్విట్జర్లాండ్ కు పయనం అవుతారు. ఈ నెల 15-18 వరకు దావోస్ సదస్సులో పాల్గొంటారు. తర్వాత మరో మూడు రోజులు లండన్ లో పర్యటించి 23వ తేదీన హైదరాబాద్ తిరిగివస్తారు.

ఇది ఇలా ఉండగా, ఢిల్లీలోనే ప్రస్తుతం సీఎం రేవంత్‌ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఉన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు సీఎం రేవంత్‌ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. ఎమ్మెల్యే కోటాలోని ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈ నెల 18వ తేదీతో నామినేషన్ల గడువు ముగియనుంది. ఈ తరుణంలోనే.. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు సీఎం రేవంత్‌ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క.

Read more RELATED
Recommended to you

Latest news