పాఠ్యపుస్తకాలలో గందరగోళం…ముందుమాటలో కేసీఆర్‌, గత మంత్రుల పేర్లు !

-

తెలంగాణ రాష్ట్ర విద్యార్దుల పాఠ్యపుస్తకాల పంపిణీ లో గందరగోళం నెలకొంది. పుస్తకాల్లోని ముందుమాటలో మాజీ సీఎం కేసీఆర్ , గత మంత్రులు, అధికారుల పేర్లు ఉన్నాయట. 1 నుంచి 10 తరగతుల తెలుగు వాచకం పాఠ్య పుస్తకాల్లోని ముందుమాట పేజీలో పొరపాటు జరిగిందట. విద్యాశాఖ మంత్రిగా సబితా ఇంద్రారెడ్డిని పేర్కొంటూ అప్పటి అధికారుల పేర్లతో ముద్రణ చేశారట.

telangana, books

దీనిపై విమర్శలు వెల్లువెత్తడంతో ఆ పేజీ తొలగించి విద్యార్థులకు ఇవ్వాలని విద్యాశాఖ కమిషనర్ శ్రీ దేవసేన డీఈవోలకు ఆదేశాలు ఇచ్చారట. దీంతో ఆ పేజీ తొలగింపుతో వెనుకవైపు ఉన్న వందేమాతరం, జాతీయ గీతం, సామూహిక ప్రతిజ్ఞ లేకుండానే పుస్తకాలు ఉన్నాయని సమాచాంర. కానీ ఈ విషయం తెలియక బుధవారం పాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థులకు అధికారులు పాఠ్య పుస్తకాలు, వర్క్‌బుక్‌లు పంపిణీ చేశారు. విద్యా శాఖ వీటి లో ముందుమాట మార్చకుండా ముద్రించింది. ఇది వివాదాస్పదం కావడంతో వాటిని వెనక్కి తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news