కేసీఆర్ 10 తలల దిష్టిబొమ్మలను దగ్ధం చేయాలని కాంగ్రెస్‌ పిలుపు

-

కేసీఆర్ 10 తలల దిష్టిబొమ్మలను దగ్ధం చేయాలని కాంగ్రెస్‌ పిలుపు నిచ్చింది. నేడు కాంగ్రెస్ ఆధ్వర్యంలో దశాబ్ది దగా కార్యక్రమం జరుగనుంది. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల పేరుతో బిఆర్ఎస్ ప్రభుత్వ నిధులు వెచ్చిస్తూ పార్టీ ప్రచార కార్యక్రమాలు చేపడుతున్న విషయం తెలిసిందే.

అయితే తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను దశాబ్ది దగా పేరుతో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వంపై నిరసన కార్యక్రమాలు చేపట్టాలని శనివారం నాడు ఏఐసీసీ ఇంచార్జ్ శ్రీ మానిక్ రావ్ ఠాక్రే అధ్యక్షతన జరిగిన రాజకీయాల వ్యవహారాల కమిటీ (పిఏసీ) లో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సూచన మేరకు నిర్ణయం తీసుకున్నారు.

ఇందులో భాగంగా ఇవాళ అన్ని నియోజక వర్గ కేంద్రాలలో దశాబ్ది దగా పేరుతో కేసీఆర్ దిష్టి బొమ్మ ను రావణ సురుడిలాగా తయారు చేసి పది తలలు ఏర్పాటు చేసి తలలకు ప్రభుత్వ వైఫల్యాలను రాసి భారీ ప్రదర్శన తీసి దగ్ధం చెయ్యాలని కాంగ్రెస్ పిలుపునిచ్చింది. అనంతరం ఆర్.డి. ఓకు గాని, ఎమ్మార్వో కు గాని వినతి పత్రాలు అందించాలని పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version