ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ అందజేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. రేపు జరగనున్న క్యాబినెట్ భేటీలో ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్ల పైన చర్చలు జరగనున్నట్లుగా సమాచారం అందుతోంది. ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్ల పైన రేపు చర్చలు జరుగుతాయి.

ఉద్యోగులు ఐదు డిఏలు కోరగా ఒక డిఏ విడుదల చేసేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉందని రెండో డిఏ పైన చర్చలు కొనసాగుతాయని సమాచారం అందుతోంది. అంతేకాకుండా రూ. 11 వేల కోట్ల పెండింగ్ బిల్లుల చెల్లింపులపై కూడా ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు పెంపు విషయంపై కూడా రేపు చర్చలు జరుగుతాయి. కొత్త పోస్టుల మంజూరు తదితర విషయాలపైన రేపు జరిగే భేటీలో మాట్లాడనున్నారు. దీంతో ప్రభుత్వ ఉద్యోగులు సంతోషంలో ఉన్నారు.